ఏపీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

55చూసినవారు
ఏపీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఏపీలోని గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలోని శ్రీచైతన్య టెక్నో క్యాంపస్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చిలకలూరిపేటకు చెందిన కరణం పద్మసుధ మంగళవారం రాత్రి ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఎన్ఐటీ పాట్నాలో బీటెక్ చదువుతున్న ఏపీ విద్యార్థిని హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్