ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్ పాస్టర్లతో సమావేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుడి పాలెంలో ఈ భేటీ జరిగింది.
రాజకీయాలు మాట్లాడేందుకు తాను ఇక్కడికి రాలేదని.. దేవుడి రాజ్యం గురించి చెప్పేందుకే వచ్చానని అనిల్ తెలిపారు. బలవంతుడిని ఓడించేందుకు దేవుడు ఎప్పుడూ బలహీనుడిని ఎంచుకుంటాడని చెప్పారు. ఏమీ తెలియని స్థితిలో ఉన్నపుడు ఓ ఉన్నతమైన పిలుపు ఇస్తాడని పేర్కొన్నారు.