తమిళనాడులోని చెన్నై పట్టణంలో ఓ మహిళా ప్రయాణికురాలికి ఊహించని అనుభవం ఎదురైంది. కదులుతున్న బస్సులో సీటు కింద పెద్ద రంధ్రం పడింది. అక్కడే కూర్చున్న ఓ మహిళ ఆ రంధ్రంలో చిక్కుకుంది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపడంతో అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి ఆమె తప్పించుకుంది. చెన్నైలోని వల్లలార్ నగర్ నుంచి తిరువెర్కాడు మధ్య నడుస్తున్న మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఆ మహిళ ప్రయాణించింది.