AP: అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

62చూసినవారు
AP: అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ మూడో వారంలో తుది వాదనలు వింటామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. అవినాష్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్