ఏపీ నూతన సీఎస్గా సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే తన పనిపై దృష్టి పెట్టారు. ఈరోజు సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.