AP: నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చామని సీఎం జగన్ తెలిపారు. "పేదల ఆరోగ్యం కోసం ఇంతలా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదన్నారు. పేదవాడి వైద్యం కోసం ఆరోగ్యశ్రీని రూ.25 లక్షల వరకు విస్తరించాం. పేషెంట్ విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరాతో ఆదుకున్నాం. గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం." అని సీఎం పేర్కొన్నారు.