ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది. మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువా వేసుకొని హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వాకౌట్ చేశారు. దాంతో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు.