'బ్యాంకుల నోటీసులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తా'

77చూసినవారు
'బ్యాంకుల నోటీసులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తా'
ప. గో జిల్లా పాలకొల్లులో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటించారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఆమె పరిశీలించారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో పురందేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తమ ఇళ్లను బ్యాంకులో తాకట్టు పెట్టారని బాధితుల ఆరోపించారు. దీంతో బ్యాంకుల నోటీసులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్