చీరాల కొత్తపేట రోడ్డులో యుటిఎఫ్ నిర్మించిన దాచూరి రామిరెడ్డి స్వర్ణోత్సవ నూతన భవనం ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతోపాటు పలువురు యూటీఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ చీరాలలో నిర్మించిన ఈ భవనం వేదికగా ఉపాధ్యాయులు భవిష్యత్తు ఉద్యమాలకు రూపకల్పన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.