అచ్చంపేటలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలు సీజ్

84చూసినవారు
ఇసుక అక్రమ రమాణాపై పోలీసులు గురువారం మెరుపు దాడులు చేశారు. పల్నాడు జిల్లాలోని అచ్చంపేట, క్రోసూరులో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసు, రెవెన్యూ సిబ్బంది దాడి చేశారు. క్రోసూరులో ఇసుక తరలిస్తున్న మూడు లారీలు, అచ్చంపేటలో ఐదు ఇసుక లారీలను సీజ్ చేశారు. అనంతరం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్