చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. వీటిలో కొన్నింటికి మాత్రమే చంద్రబాబు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఈసీఐ ముఖ్యకార్యదర్శి అవినాష్కు సీఈఓ ఆదేశించారు.