ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ తరఫున అధికారిక వీడియోలు, లైవ్లు పోస్ట్ చేసే యూట్యూబ్ ఛానెల్ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఛానెల్ పేరును ‘మైక్రోస్ట్రాటజీ’గా మార్చేసి.. అందులో బిట్ కాయిన్ వీడియోలు పెట్టారు. అలాగే యూట్యూబ్ ఛానెల్ను బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు. దాంతో జనసేన టెక్నికల్ సిబ్బంది తమ ఛానెల్ హ్యాక్ అయినట్లు యూట్యూబ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.