డిప్యూటీ సీఎం మమ్మల్ని మోసం చేశారు: దళిత మహిళ

61968చూసినవారు
డిప్యూటీ సీఎం మమ్మల్ని మోసం చేశారు: దళిత మహిళ
తన భర్తకు ఎమ్ఎన్ఓ ఉద్యోగం ఇప్పిస్తామంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మోసం చేశారని గణపవరం ప్రాంతానికి చెందిన ఓగిరాల పరిమళ సుమన ఆరోపించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఉప ముఖ్యమంత్రికి రూ.4.50 లక్షలు అందించామని సుమన పేర్కొంది. ఎమ్ఎన్ఓ పోస్టుకు బదులు స్వీపర్ పోస్టు ఇచ్చి.. ఏడాదిలోనే తొలగించారు. అడిగితే దాడికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఎంని వివరణ కోరగా.. తాను ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్