లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో ఢిల్లీలోని జాతీయ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దీన్ని రూపొందించారు.