AP: రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అధికార వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే నల్లగట్ల స్వామిదాసును తిరువూరు ఇంఛార్జిగా
వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి వైసీపీని వీడే యోచనలో ఉన్నారు. అయితే రక్షణనిధి టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు
టీడీపీ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.