కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరప్పనేని గూడెంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 18 మంది గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.