ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని పౌరసత్వ సవరణ చట్టం ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. 'ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు ఎందరో దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్కి తెలియదనుకుంటా. సీఏఏకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు' అని ఫైర్ అయ్యారు.