ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

69చూసినవారు
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతన స్కేలు అమలు చేయాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సవరించిన పే స్కేలును 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖను సూచించింది. బకాయిల మొత్తాన్ని 12 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. అలాగే కేజీబీవీల్లోని బోధనా సిబ్బంది బదిలీలను నిలుపుదల చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్