ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్తో పాటు పలువురు అధికారులపై టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఇవాళ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. ఈ మేరకు పోలీసులు జగన్తో పాటు అధికారులు సునీల్, విజయ్ పాల్, తదితరులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.