పాడి రైతులకు చంద్రబాబు వెన్నుపోటు: YCP

80చూసినవారు
పాడి రైతులకు చంద్రబాబు వెన్నుపోటు: YCP
ఏపీలో పాడి రైతులకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ ఆరోపించింది. ‘హెరిటేజ్ కోసం ప్రైవేట్ డెయిరీలకు చంద్రబాబు బెదిరింపులు. ప్రైవేట్ డెయిరీలు పాల రేట్లను తగ్గించేసి పాడి రైతుల పొట్ట కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో 27 లక్షల పాడి రైతుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. బ్యాంకు రుణాలు, అప్పులు తీర్చేదారి లేక పాడిని అమ్మేసుకుంటున్న దుస్థితి నెలకొంది.’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్