చంద్రబాబు తనను చాలా ఇబ్బందులకు గురి చేశాడని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జగన్కు, పవన్కు చాలా తేడా ఉంది. చిరంజీవి ఓడిపోయాడు. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు. ఉద్యమం వల్ల నేను చాలానే నష్టపోయాను. నా శత్రులతో పవన్ ఎలా కలుస్తాడు. పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడు. ఇంకో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారు.’ అని అన్నారు.