వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కని టీడీపీ సీనియర్ నేతలకు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. ఇవాళ సీనియర్ లీడర్లతో ఆయన మాట్లాడారు. పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేసిన సీనియర్ నేతలందరికీ అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తానని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. టికెట్ దక్కకపోయినప్పటికీ పొత్తు ధర్మం పాటించి.. ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలిపాలని కోరారు.