7 మంది అరెస్ట్: డిఎస్పీ

50చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధి మునుస్వామిపురంలో ఈ నెల 12న జరిగిన ఘర్షణలో 7 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, మునస్వామిపురంలో వినయ్ అనే వ్యక్తిపై దాడి చేసిన ఏడు మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితులతోపాటూ ఓ కత్తి, ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. అల్లర్లకు, ఘర్షణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్