టీడీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అమరనాథరెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతు తెలపడానికి బైరెడ్డిపల్లి మండల నాయకులు భారీగా పలమనేరుకు వచ్చారు. టీడీపీ బైరెడ్డిపల్లి ఇన్ఛార్జ్ కిశోర్ గౌడ్ చిందులు వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. మండల కార్యదర్శి సుబ్రమణ్యం ఆద్వర్యంలో బైరెడ్డిపల్లె నుంచి పలమనేరు వరకు ర్యాలీ చేపట్టారు.