చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం ఆలయంలో కూటమి నాయకులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాణిపాకం ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.