వైభవంగా వరదరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు

66చూసినవారు
యాదమరి మండలంలోని ప్రసిద్ధ భూదేవి శ్రీదేవి సమేత వరదరాజుల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా మూలవర్లకు పుష్ప కైంకర్యం అలంకార అభిషేకం, పంచామృత అభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని అర్చకులు తెలిపారు. ఆదివారం రాత్రి యాలి వాహన సేవ ఉంటుందన్నారు. భక్తులు పాల్గొని స్వామి వారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలన్నారు.

ట్యాగ్స్ :