13 మంది సంఘమిత్రలను తొలగించిన అధికారులు

55చూసినవారు
13 మంది సంఘమిత్రలను తొలగించిన అధికారులు
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో గతంలో పని చేసిన 13 మంది సంఘమిత్రలను బుధవారం అధికారులు తొలగించారు. మోటు మల్లెలలో ఇద్దరు, రొంపిచర్ల పంచాయతీలో ఐదు మంది, గానుగచింత, బోడిపాటివారిపల్లి, బొమ్మయ్య గారిపల్లి, చిచ్చిలి వారిపల్లి, చంచంరెడ్డిగారిపల్లి, బండకిందపల్లిలో ఒక్కొక్కరిని తొలగించారు. దీనిపై సంఘమిత్ర ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్