గంజాయి, డ్రగ్స్ ఇతర వ్యసనాల కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యసనాలు డబ్బు, భూమి అని అలాంటి వ్యసనాలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. సోమవారం తిరుపతి రూరల్ పైడిపల్లిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన వ్యసనం డబ్బు అని అలాంటి వ్యసనంతో చెవిరెడ్డి ఒంగోలుకు మకాం మార్చారన్నారు.