కుప్పంలో చంద్రబాబుకు భంగపాటు తప్పదు
సొంత ఊరు చంద్రగిరి వదిలి కుప్పానికి వెళ్లిన చంద్రబాబు నాయుడుకు భంగపాటు తప్పదని ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప అన్నారు. గురువారం ఆయన తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కలిసి చంద్రగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తరువాత నియోజకవర్గాన్ని ఆ స్థాయిలో చంద్రగిరిని అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దక్కుతుందన్నారు.