నాడు నేడు పనులలో అవకతవకలు: టీడీపీ

79చూసినవారు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు. ప్రధానంగా పాఠశాలలో రాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతోందని‌ టీడీపీ నాయకులు గుర్తించారు. అదేవిధంగా పాఠశాల‌ అభివృద్ధికి గత ప్రభుత్వం 50 లక్షలు నిధులు విడుదల చేసినా పనులు జరగలేదని, నాడు నేడు పనులలో అవకతవకలు జరిగాయని వారు స్పష్టం చేశారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్