నిండ్ర మండలం కూనమరాజుపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ జవాను e. సుబ్రమణ్యం నాయుడు బుధవారం రాత్రి మృతి చెందాడు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న అతను తిరుపతి రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. గురువారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.