నిండ్ర మండలం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శనివారం అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సమరసతా సేవా పౌండేషన్, మండల బిజెపి కార్యకర్తలు ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహిళలచే గ్రామ పురవీధుల్లో ఊరేగించి నిండ్ర మండలంలోని 21గ్రామాలకు పంపిణీ చేశారు.