వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం

53చూసినవారు
వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం
నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరిజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలు పూలమాలలతో విశేషంగా అలంకరించి లోక కళ్యాణార్ధం శ్రీ లక్ష్మీ నారాయణ హోమం నిర్వహించి అనంతరం అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్