నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం పౌర్ణమిని పురష్కరించుకుని విశేష పూజలు వ్రతాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి విశేష అభిషేకాలు హోమం నిర్వహించి భక్తుల గోవింద నామస్మరణల నడుమ అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విశేషంగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. తితిదే వారి సౌజన్యంతో హరికథ మరియు అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.