శ్రీ ధనలక్ష్మీ దేవిగా అమ్మవారు

555చూసినవారు
శ్రీ ధనలక్ష్మీ దేవిగా అమ్మవారు
నిండ్ర మండలం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా అత్యంత వైభవంగా దర్శనమిచ్చారు. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్యులు మహిళలచే ఉదయం కుంకుమార్చన, లోకకళ్యాణార్ధం మహాలక్ష్మీ మహా హోమం నిర్వహించారు. దసరా ఉత్సవాలు బుధవారంతో ముగుస్తాయని ఆలయ కమిటీ తెలియచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్