సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గెలుపుకు మైనార్టీ సోదరులు అందరూ సహకరించాలని జిల్లా పంచాయతీరాజ్ అభివృద్ధి మండలి సభ్యులు డాక్టర్ షేక్ హబీబ్ బాష శుక్రవారం పీలేరు పెద్ద మసీదు వద్ద కరపత్రాలు పంచుతూ కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు పెద్దోడు, చలపతి, ఎంపీటీసీలు ఇబ్రహీం, జోహార్, ఏఎంసీ డైరెక్టర్ మునీర్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.