మదనపల్లి నుండి తంబళ్లపల్లె మార్గంలో పలు రకాల ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అయితే శనివారం ఒక అద్దె ఆర్టిసి బస్సులో కనీసం ప్రయాణికులు కూర్చోలేని స్థితిలో కుర్చీలు విరిగిపోయి ఉన్నాయి. ఫలితంగా కుర్చీలో ప్రయాణికుడికి బదులు లగేజీలు పెట్టుకుంటున్నారు. దీనిని గమనించిన ప్రయాణికులు ఆర్టీసీ డిపో మేనేజర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.