ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం ముస్తాబు

55చూసినవారు
తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ పుష్ప అలంకరణ చేసింది. ఆలయంలోని ధ్వజస్తంభం, రంగనాయకుల మండపంతో పాటు అద్దాలమేడను వివిధ రకాల పండ్లు, పుష్పాలతో అలంకరించారు. విద్యుత్ దీపాలతో ఆలయ గోపురం ఆలయం చుట్టూ గోవిందా నామాలతో అలంకరించారు. అలాగే ఆలయం వెలుపల పుష్పాలతో అలంకరించిన రామలక్ష్మణ హనుమంతులతో పాటు చిన్ని కృష్ణుడు అవతారాలను టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్