ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనపై ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తుండటం ఆసక్తికరం. అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం)కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు. బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషిక్తులయ్యారు.