నెల్లూరు జిల్లా అల్లూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. రామకృష్ణ జూనియర్ కాలేజీలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు బీద రవిచంద్ర, సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అలాగే, శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం గోకర్ణపల్లిలో కూడా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.