AP: లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. "18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు. మన పార్లమెంటరీ సంప్రదాయాలను నిలబెట్టి, చిత్తశుద్ధితో, విజ్ఞతతో సభను నడిపించడంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా." అని పేర్కొంటూ సీఎం ట్వీట్ చేశారు.