ఏపీ సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం 20వ రోజు బస్సు యాత్రలో పినగాడి జంక్షన్ నుంచి ప్రారంభమై వేపగుంట చేరుకున్నారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి విశాఖపట్నంలో రోడ్ షో నిర్వహించనున్నారు. గోపాలపట్నం, ఎన్ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు.