కాంగ్రెస్ పార్టీపై బిహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ‘తాము ప్రజలకు అనుకూలంగా ఉంటామని కాంగ్రెస్ చెబుతోంది. అందుకే నేను ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. బిహార్లో 2005కు ముందు ఉన్న పరిస్థితులను గుర్తు తెచ్చుకోండి. ప్రజలు రాత్రుళ్లు బయటికి పోలేని పరిస్థితి ఉండేది. రోడ్లు, ఆరోగ్య సౌకర్యాలు లేవు. బాలికలకు చదువుకునే అవకాశం ఉండేదికాదు’ అని చెప్పుకొచ్చారు.