మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స

72చూసినవారు
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స
ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిందో తెలియడం లేదన్నారు. వైసీసీ జిల్లా కార్యాలయాలపై జరుగుతున్న రాద్దాంతం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వెళ్లి.. వాటిని పరిశీలించడం తగదన్నారు.

సంబంధిత పోస్ట్