నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తాం: సిట్ చీఫ్

79చూసినవారు
నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తాం: సిట్ చీఫ్
తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. ఆదివారం తిరుమలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు సిట్‌కు బదిలీ అయిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నామని వివరించారు. టీటీడీ బోర్డు నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్