AP: వైసీపీ ఓటమిపై గురజాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "నాసిరకం మద్యం ఓటమికి కారణం. మద్యం తాగేవాళ్లు మాకు ఓటు వేయలేదు. ఇసుక విధానం వల్ల పేదలు నష్టపోయారు. పార్టీలోని కొంతమంది నేతల నోటి దురుసు కూడా ఓటమికి కారణం. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబును బూతులు తిట్టారు. అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణుల్లో కసిని పెంచాయి." అని ఆయన పేర్కొన్నారు.