రాజోలు జనసేన అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ ను ప్రకటించారు. దేవా వరప్రసాద్ స్వగ్రామం మలికిపురం మండలం దిండి గ్రామం. వైసీపీలో రెండు సార్లు ఓడి జనసేనలో చేరిన బొంతు రాజేశ్వరరావుకు టికెట్ వస్తుందని అనుచరులు ఆశించారు. ఇప్పుడు వరప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో బొంతు వర్గం నిరాశలో ఉన్నారు.