ఇంజెక్షన్లు వికటించి.. 17 మంది అస్వస్థత

78చూసినవారు
ఇంజెక్షన్లు వికటించి.. 17 మంది అస్వస్థత
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని 50 పడకల ఆస్పత్రిలో ఇంజెక్షన్లు వికటించడంతో అక్కడ చికిత్స పొందుతున్న పలువురు రోగులు మరింత అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రోగులు, బాలింతలు మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. విధుల్లో ఉన్న వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు వీరికి ఇంజెక్షన్లు ఇచ్చారు. కాసేపటి తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దాంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్