విషాదం.. ఒకే రోజు నలుగురు చిన్నారులు మృతి

50చూసినవారు
విషాదం.. ఒకే రోజు నలుగురు చిన్నారులు మృతి
ఏపీలోని కర్నూలు జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో నిన్న నలుగురు చిన్నారులు మృతి చెందారు. నందవరం మండలంలోని కే.నాగలాపురంలో హరికృష్ణ, మహేశ్ అనే అన్నదమ్ములు పొరపాటున పురుగుల మందు తాగారు. ఈ ఘటనలో మహేశ్ మృతి చెందాడు. ఇదే మండలంలోని మాచారంలో నీటి గుంతలో పడి అన్నదమ్ములు బైరి ఉదయ్ (6), అనుమేశ్ (5) మరణించారు. ఎమ్మిగనూరు మండలం పొర్లపల్లిలో వంకలో పడి సంపత్ (12) మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్