AP: సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ నగదు అందజేస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. "ఎన్నికల హామీ మేరకు రూ.3 వేల నుంచి రూ.4వేలకు పెన్షన్లు పెంచి ఇస్తాం. మొత్తంగా 65.3 లక్షల పెన్షన్దారులకు లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వం పింఛన్లకు ఏడాదికి రూ.23,272.44 కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం రూ.33,099.72 కోట్లు ఖర్చు చేయనుంది." అని మంత్రి పేర్కొన్నారు.